కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడి
గిరిజన పరిశోధనా సంస్థల పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో గిరిజన పరిశోధనా సంస్థ 2014లో ఏర్పాటు చేయటం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకం “గిరిజన పరిశోధనా సంస్థలకు మద్దతు (TRIs)” కింద ఆంధ్రప్రదేశ్తో సహా గిరిజన పరిశోధనా సంస్థలకు ప్రైమర్ల తయారీకి ఆర్థిక సహాయం అందించబడుతుంది. బహుభాషా విద్య (MLE) పథకం కింద, గిరిజన భాషల్లో ప్రైమర్లు, వర్ణమాల, స్థానిక పద్యాలు, కథలు ప్రచురించబడుతున్నాయని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ యూకే వెల్లడించారు.
రాష్ట్రాల వారీగా గత ఐదేళ్లలో నిర్దిష్ట పథకం కింద మద్దతునిచ్చిన మొత్తం గిరిజన పరిశోధనా సంస్థలకు మంజూరు చేసిన నిధులు, శిక్షణా కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల సంఖ్య, ఇప్పటి వరకు టి.ఆర్.ఐ లకు విడుదల చేసిన మొత్తం ప్రైమర్ల సంఖ్య, బోధన కోసం టి.ఆర్.ఐ లకు విడుదల చేసిన ఈ ప్రైమర్లను ఉపయోగించే మొత్తం విద్యా సంస్థల సంఖ్యకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం వివరాలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ యూకే గురువారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకం ‘గిరిజన పరిశోధనా సంస్థలకు టిఆర్ఐ మద్దతు కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 29 గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. గత ఐదేళ్లలో ఎపి 2020-21 లో 54.2 కోట్లు మంజూరు చేయగా రూ.45.5 కోట్లు విడుదల చేశారు. 2021-2022 లో రూ.24.5 కోట్లు మంజూరు కాగా రూ.43.2 కోట్లు విడుదల అయ్యాయి. 2022-2023 లో రూ.56.16 కోట్లు మంజూరు కాగా రూ.21.91 కోట్లు విడుదల చేసినట్లు, 2023-2024 లో రూ.108 కోట్లు మంజూరు కాగా రూ.12.50 కోట్లు విడుదల కాగా, 2024-2025 లో రూ.13.40 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు నిధులు ఏమి విడుదల కాలేదని పేర్కొన్నారు.
ఈ పథకం కింద, మౌలిక అవసరాలు, పరిశోధన డాక్యుమెంటేషన్ కార్యకలాపాలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, గిరిజన పండుగల నిర్వహణ, విశిష్ట సాంస్కృతిక వారసత్వం , పర్యాటకం ప్రచారం కోసం యాత్రలు, గిరిజనుల మార్పిడి సందర్శనల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్వహించబడతాయి, తద్వారా వారి సాంస్కృతిక పద్ధతులు, భాషలు ఆచారాలు సంరక్షించబడతాయి. ప్రచారం చేయబడతాయని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
ట్రాయ్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా నియంత్రణలో ఉంటాయని, కేంద్ర ప్రాయోజిత పథకం కింద గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ “గిరిజన పరిశోధనా సంస్థలకు మద్దతిస్తుందని, ఆంధ్రప్రదేశ్తో సహా గిరిజన పరిశోధనా సంస్థలకు బహుభాషా విద్య (ఎంఎల్ఈ) ఇంటర్వెన్షన్ కింద గిరిజన భాషల్లో ప్రైమర్లను సిద్ధం చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, ప్రాసలు, మరియు గిరిజన భాషలలో కథలు. ఇంకా, కొత్త విద్యా విధానం చిన్న పిల్లలు వారి ఇంటి భాష మరియు మాతృభాషలో త్వరగా నేర్చుకునేందుకు నిర్దేశిస్తుందని, దీని ప్రకారం, విద్యను అందించడానికి మరియు భాషా పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుభాషా విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయని, విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లుగా, మంత్రిత్వ శాఖ 2013లో మైసూరులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) కింద అంతరించిపోతున్న భాషల రక్షణ మరియు సంరక్షణ పథకం ప్రారంభించిందని కేంద్ర మంత్రి తెలిపారు.